శాసనసభ సమావేశాలు 14వ తేదీకి వాయిదా
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ శాసనసభ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సభను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.అదే రోజున స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బీఏసీలో నిర్ణయించనున్నారు.