కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చాడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయ్యేనాటికి లిక్కర్ తో రాష్ట్ర ఆదాయం 10వేల కోట్లు ఉండేది, కానీ ఎనిమిదేళ్లలో 36 వేల కోట్లకు పెరిగింది అన్నారు. ఇది మా ఆడబిడ్డల రెక్కల కష్టం కాదా? అమరుల త్యాగాలు ఇలాంటి తెలంగాణ కోసమా? పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? మునుగోడు ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించండి అన్నారు. తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చినందుకు కేసీఆర్ ను చెప్పుతో కొట్టినా తప్పులేదు. మునుగోడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి, లక్కారం చెరువు నిండితే కాలువలు తీసే సోయి కేసీఆర్ కు లేదు అన్నారు. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే స్రవంతిని గెలిపించండి అని ఓటర్లను కోరారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యముంటే ఆడబిడ్డ సవాల్ ను స్వీకరించండి మందు పోయకుండా ఓటు అడుగుతామని నరసింహ స్వామి మీద ప్రమాణం చేయండి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.