ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్ : బీర్కూర్ గ్రామానికి చెందిన మిద్దిoటి సంధ్యారాణి (18)అనే యువతి కడుపు నొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్ గ్రామానికి చెందిన సంధ్య రాణి 6 నెలల క్రితం ధామరంచ గ్రామం లో తన మేనత్త గంగవ్వ ఇంటికి వచ్చింది.. అక్కడ నుoచే నిత్యం బాన్సువాడ కు వెళ్లి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు కడుపు నొప్పి ఉండటంతో పలుమార్లు ఆసుపత్రిలో చూపించిన నయo కాలేదు. మంగళవారం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో రేకుల షెడ్డు పైపుకు తాడు తో ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇంకా వివాహం కాలేదు..

Leave A Reply

Your email address will not be published.