ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ పై కేంద్రం మల్లీ మొండి చెయ్యి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మళ్లీ మొండిచేయి ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని లోక్‌సభలో కొంతమంది టీడీపీ, వైసీపీ ఎంపీలు కలిసి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ప్రశ్నించగా ఆయన దాటవేసినట్లు తెలుస్తోంది. అయితే ఏపీతో పాటు మహారాష్ట్ర ఎంపీలు కూడా పంకజ్ చౌదరిని కలిసినట్లు సమాచారం. గత ఐదేళ్లలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని ఆయన తోసిపుచ్చారు.కాగా.. కోవిడ్-19 దృష్ట్యా మూలధన వ్యయంలో పలు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించే పథకాన్ని మాత్రం కేంద్రం అమలు చేసింది. ఇందులో భాగంగా 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలా వడ్డీ లేని రుణాన్ని సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2020-21లో రూ. 688 కోట్లు, 2021-22లో 501.79 కోట్లు, 2022-23లో 6105.56 కోట్లు కేంద్రం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21లో రూ. 358 కోట్లు, 2021-22లో 214.14 కోట్లు, 2022-23లో 2500.98 కోట్లు విడుదల చేసింది.

Leave A Reply

Your email address will not be published.