విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైదరాబాద్ పద్మారావు నగర్ పద్మనాభ రెసిడెన్సి కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ‘విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్’ హైదరాబాద్ వారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు1.కొండూరి సాయి ప్రీతి, ఇంటర్, వరంగల్, 20,000/-,2.లక్కోజు త్రిషు, బి ఎస్ సి, తణుకు, 25,000/-,3.దాసోజు సాయి లక్ష్మి, 7వ తరగతి, హైదరాబాద్, 20,000/-రూపాయలు ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చెైర్ పెర్సన్ గొల్తి శైలజ మల్లికార్జున రావు, అధ్యక్షులు చింతాడ నరేంద్ర కుమార్, గౌరవ సలహాదారులు PVRK ప్రసాద్, కమిటీ నుండి వింజరపు గోవింద రావు, ఇతర సభ్యులు, అతిధిగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు తాతారావు మాట్లాడుతూ కీ.శే. డాక్టర్ గొల్తి మల్లికార్జున రావు గారి వారసత్వంగా తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు అమూల్యమైన సేవలు అందజేస్తున్నవి.కె.ఎఫ్.ఎస్.టి సేవా సంస్థకు వెస్సో తరఫున అభినందనలు తెలిపారు. విద్యార్థుల కోరికను విద్యా సంవత్సరం మధ్యలో తెలియ చేసినప్పటికీ, తమ కోరికను అంగీకరించి పేద విద్యార్థులకు స్కాలర్షిపప్లు అంద చేసినందుకు వెస్సో తరఫున బంగారు తాతారావు ఫౌండేషన్ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.