వడ్ల కొనుగోలుకు ఎలక్ట్రానిక్ తూకం యంత్రం వాడాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో,రైస్ మిల్లు ల్లో కూడా విద్యుత్ (ఎలక్ట్రానిక్) తూకం యంత్రమే ఉపయోగించాలని, బాట్లు ఉపయోగించవద్దని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు సోమవారం నాడు ఆయన కందుకూరు పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల ను పరిశీలించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కనీస మద్దతు ధర తో సేకరిస్తున్న వడ్ల ను రైతుల వద్ద నుంచి కొనేటప్పుడు పారదర్శకత కు ప్రాధాన్యం ఉండాలనీ సూచించారు.జాతీయ రహదారి పై పలు చోట్ల వడ్లు ఆర పోసిన రైతు ల ను కలిసి,ప్రభుత్వం చెల్లిస్తున్న కనీస మద్దతు ధర పై అవగాహన కలిగించారు.పంట ను ఏ,బి గ్రేడ్ రకాలని చెప్పారు.ధాన్యం కొనుగోలు,సేకరణ విషయంలో రైతులకు ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు.దళారుల ను నమ్మవద్దు,మోసపోవద్దన్నారు. వడ్ల పరిమాణం పై తరుగు తీస్తున్నారు అన్న ఫిర్యాదులు వస్తే సదరు మిల్లు పై చర్య తీసుకుంటామన్నారు. రైతులకు అపోహ, అనుమానాల ను రఘునందన్ నివృత్తి చేశారు.దళారుల ను మిల్లర్లు సైతం ప్రోత్సహించవద్దని హెచ్చరించారు.ధాన్యo నాణ్యతా యుతంగా ఉంటే రైతే రాజు అని రఘునందన్ సుస్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.