తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య గౌడ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కులవృత్తులకు, చేతివృత్తులకు పూర్వ వైభవాన్ని తెచ్చారన్నారు. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కల్లు ను నిషేదించి గీత వృత్తిని కనుమరుగు చేయాలని కుట్రలు చేశారన్నారు. సీఎం కేసిఆర్ అదేశాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మూతపడ్డ కల్లు దుకాణాలను తెరిపించి గౌడ్ల ఆత్మ గౌరవాన్ని నింపారన్నారు. గౌడ్లు ఆర్థికంగా ,సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ , అభివృద్ధి పతకాలను అందించారన్న్నారు. తాటి, ఈత చెట్ల పన్నును రద్దు చేశారు. సొసైటీల బకాయిలను రద్దు చేశారన్నారు. గీత వృత్తిని ప్రోత్సహించేందుకు హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి ,ఈత చెట్లను , గిరిక చెట్లను నాటి ప్రోత్సహిస్తున్నారు. గతంలో గీత కార్మికులు తాటిచెట్టు పై నుండి పడి మరణించిన, అంగ వైకల్యానికి గురైన గీత కార్మికులకు 50 వేల రూపాయలు ఇచ్చేవారు అన్నారు. నేడు సీఎం కేసీఆర్ గారు గీత కార్మికులు తాటి ,ఈత చెట్ల పై నుండి ప్రమాదవశాత్తు పడి మరణించిన, శాశ్వతంగా అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు 5 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా ను అందించి గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైన్ షాపులలో 15% రిజర్వేషన్లు కల్పించి గౌడ్లు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారన్నారు. గతంలో గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారులు ఎన్నో దాడులు చేసి కేసులు నమోదు చేసేవారు. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల ను ఎక్సైజ్ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఆదేశించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నీరా పాలసిని ప్రవేశపెట్టి నీరా ను గౌడ్ లు మాత్రమే ఉత్పత్తి చేసి అమ్మకాలు జరిపేలా ప్రత్యేక జీవోను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 20 కోట్ల రూపాయల తో హైదరాబాద్ లో ని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించమన్నారు. ఇదే నియోజకవర్గ పరిధిలో సర్వేల్ లో నీరా ఉత్పత్తి కేంద్రం ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గౌడ్ల ఆత్మ గౌరవం కోసం సుమారు 500 కోట్ల విలువైన భూమిని కోకాపేటలో కేటాయించారన్నారు. గీత కార్మికులకు గుర్తింపు కార్డులను అందిస్తున్నామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. గ్రూప్ 1 పరీక్ష లో పాపన్న చరిత్ర పై ప్రశ్న రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. పాపన్న నిర్మించిన కోటలను పర్యాటకం గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, రైతు బంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్ ఉచిత సరఫరా లాంటి పథకాల తో పాటు సాగునీరు, పరిశుద్ధ మైన మంచి నీరు అందిస్తున్నామన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలని మంత్రి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, గుజరాత్ , గోవా లాంటి రాష్ట్రాల్లో కల్లు అమ్మకాలను నిషేధం విధించారన్నారు. రాష్ట్రంలో గౌడ్ ల సంక్షేమానికి, అభివృద్ధి కి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి గౌడ సంఘాలు, వృత్తిదారులు, కార్మికులు మద్దతు గా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, పల్లె రవి కుమార్ గౌడ్, జై గౌడ్ జాతీయ అధ్యక్షుడు డా. వట్టికూటి రామారావు గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరేళ్ళ వేములయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్వీ యాదయ్య గౌడ్, యాదగిరి గౌడ్, కాశయ్య గౌడ్, నర్సింహ గౌడ్, టిఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, నీరా సత్యం గౌడ్, మమత గౌడ్, బత్తిని లత గౌడ్, విజయ గౌడ్, కేఎల్ఎన్ ప్రసాద్ గౌడ్, ముద్దగోని నగేష్ గౌడ్, బింగి భారత్ గౌడ్, నారాయణ పురం జడ్పీటీసీ వెంకటేష్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ 2వార్డ్ కౌన్సిలర్ స్వామి గౌడ్, తాళ్ళ సింగారం అధ్యక్షుడు నగేష్ గౌడ్, లింగోజీ గూడం అధ్యక్షుడు సతీష్ గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.