కొత్తిమీరిన బిగ్ బాస్ అభిమానుల పైత్యం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటనలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. బిగ్ బాస్ ఫైనల్‌లో పోటీపడిన కంటెస్టెంట్ల అభిమానుల పేరుతో అల్లరి మూకలు చేసిన హంగామా, గొడవ సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యేలా చేశాయి. అంతేకాదు, ప్రభుత్వ ఆస్తులను ఈ అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. అసలు వీళ్లు అభిమానాలా లేకపోతే అల్లరి మూకలా అనే అనుమానం కలిగేలా వీరంతా ప్రవర్తించారు.బిగ్ బాస్ షో చరిత్రలో ఒక రైతుబిడ్డ, సామాన్యుడు టైటిల్ విజేతగా నిలిచాడు. అతడే పల్లవి ప్రశాంత్. దీంతో ఇతడి అభిమానులు చాలా మంది నిన్న రాత్రి కృష్ణానగర్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. అలాగే, అమర్ దీప్ అభిమానులు కూడా భారీ ఎత్తున వచ్చారు. స్టూడియో బయట రచ్చ రచ్చ చేశారు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై వీళ్లు దాడులు చేశారు. ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగిన వారిని చెదరగొట్టారు.Bigg Boss Final: ఫ్యాన్స్ బీభత్సం.. బస్సు అద్దాలు ధ్వంసం, రోడ్డుపై రచ్చ రచ్చకాగా, బిగ్ బాస్ అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడులు చేయడాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇది అభిమానమా అంటూ మండిపడ్డారు.‘ఇదేం అభిమానం!బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్‌‌లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి TSRTCకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని సజ్జనార్ పేర్కొన్నారు.కాగా, ఈ బిగ్ బాస్ పేరుతో అభిమానుల పైత్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. సినిమా హీరోలకు మించి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అభిమానులు ఎక్కువైపోతున్నారు. అయితే, దీని వెనుక ఆయా కంటెస్టెంట్ల పీఆర్ టీమ్‌లు కూడా ఉన్నాయనేది నిజం. ఇంత పెద్ద మొత్తంలో అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్దకు తరలి వెళ్లడానికి పీఆర్ టీమ్‌ల ప్రోద్బలం ఉంటుంది. అయితే, దీన్ని నివారించాల్సిన అవసరం షో నిర్వాహకులకు ఉంది. ఈ అల్లరి మూకలను పెద్ద ఎత్తున అక్కడికి తీసుకురావడం వల్ల కొంతమంది కంటెస్టెంట్లకు కూడా అభద్రత ఏర్పడింది. ఫైనలిస్ట్ అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారును చుట్టుముట్టి కారు అద్దాలు పగలగొట్టారు. అలాగే, ఇంకొంత మంది కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేశారు

Leave A Reply

Your email address will not be published.