22, 23 తేదీల్లో ఓట‌ర్ల జాబితా పై క‌లెక్ట‌ర్లు, ఎస్పీలతో సీఈవో స‌మీక్ష

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  విజయవాడలో ఈనెల 22, 23 తేదీల్లో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ-2024, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌పై క‌లెక్ట‌ర్లు, ఎస్పీలతో స‌మీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప‌రిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ… రెండు రోజుల పాటు జరిగే సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు స‌హా మొత్తం ఏడుగురు ప్ర‌తినిధుల బృందం న్యూఢిల్లీ నుంచి వస్తున్నారని చెప్పారు. స‌మావేశ మందిరంలో సీటింగ్, అడ్రెసింగ్ సిస్ట‌మ్, భద్రత త‌దిత‌ర ఏర్పాట్ల‌ను ప్ర‌ణాళికాయుతంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమీక్షకు వచ్చే ఉన్న‌తాధికారుల‌కు ర‌వాణా, బ‌స‌, వ‌స‌తి ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించామని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.