తమిళనాడు లో వర్ష బీభత్సం పదిమంది మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టింస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురస్తున్న వర్షాలకు  జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షాల వల్ల సంభవించిన పలు ప్రమాదాల్లో వివిధ జిల్లాల్లో 10 మంది మృతి చెందారని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్ దాస్ మీనా తెలిపారు. రెండు రోజుల్లోనే ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేయడం కూడా తప్పు అని ఆమె చెప్పారు.  సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివ్ దాస్ మీనా మాట్లాడుతూ.. వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో 10 మంది చనిపోయారని తెలిపారు ఇందులో కొందరు గోడ కూలి ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు విద్యుదాఘాతంతో చనిపోయారని అన్నారు. దక్షిణాది జిల్లాల్లో ముఖ్యంగా తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యిందని, అందుకే వరదలు వచ్చాయని పేర్కొన్నారు. ఇదిలావుండగా తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కేపీ కార్తికేయన్ జిల్లాలో వరద పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. భారీ వర్షాల దృష్ట్యా తిరునల్వేలి, తెన్కాశి జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో పాటు తూత్తుకుడి జిల్లాకు సాధారణ సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా బుధవారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రద్దు చేసిన లేదా పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల జాబితాను దక్షిణ రైల్వే విడుదల చేసింది. నాగర్ కోయిల్-కన్యాకుమారి ఎక్స్ ప్రెస్, నాగర్ కోయిల్-తిరునల్వేలి ఎక్స్ ప్రెస్ లను పూర్తిగా రద్దు చేశారు.

Leave A Reply

Your email address will not be published.