సప్తహ లో పాల్గొన్న కోవూరి సత్యనారాయణ గౌడ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా, సదాశిపేట మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, శ్రీ సద్గురు ఆశ్రమం వారిచే ఏర్పాటుచేసిన సప్తాహ కార్యక్రమములో చివరి రోజున పాల్గొన్న సద్గురువులు అంతర్గావ్ ఆశ్రమం కరణ్ మహారాజ్ , శ్రీ సద్గురు ఆశ్రమం శ్రీ విద్యా ఉపాసకులు సద్గురు సంజీవ మహారాజ్ వారి ఆశీర్వాదం పొందిన బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన్న మాట్లాడుతూ ఆ సద్గురువుల ఆశీర్వాదంతో మంచి మేధాశక్తితో ప్రజా సమస్యలను తీర్చడంలో కలిగే ఆనందము సద్గురువుల ఆశీర్వాద ఫలమని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపకులు కమిటీ సభ్యులు హరి శంకర్ గౌడ్, బుచ్చిరెడ్డి, రంగారెడ్డి, కృష్ణ,మైపాల్, హరి , మద్దికుంట భక్త బృందం మరియు అంతర్గావ్ ఆశ్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.