రాష్ట్రంలో డ్రగ్ నిర్మూలనపై డిజిపి సమీక్ష
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవి గుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం లో నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.