ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. శనివారం వేకువజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టరుని వెనుక నుంచి ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ఘటనలో ట్రాక్టరులో వున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. బస్సు డ్రైవరుతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.