చండీ యాగం చేసిన మాజీ ముఖ్యమంత్రి దంపతులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యల ఆధ్వర్యంలో 40 మంది రుత్వికులు చంద్రబాబు దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో శనివారం చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నారా భువనేశ్వరితో కలిసి సతీ సమేతంగా ఆ హోమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య పండితులు చంద్రబాబు దంపతులతో ఈ యాగాన్ని చేయించారు. మూడు రోజులపాటు యాగం జరగనుంది. తొలిరోజు యజ్ఞ క్రతువులు చేయించారు పండితులు. గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యల ఆధ్వర్యంలో 40 మంది రుత్వికులు చంద్రబాబు దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు.  శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజులపాటు ఈ హోం, యాగం కొనసాగనుంది. చంద్రబాబు యాగం పురస్కరించుకుని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు నాయకులు కుటుంబ సమేతంగా యాగానికి వచ్చారు. మాజీ మంత్రలు దేవినేని ఉమా, నారాయణ, రవీంద్రబాబు, నెట్టుం రఘురాం, కన్నాలక్ష్మి నారాయణ, ఆలపాటిరాజా, బోండా ఉమా, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.