శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శ్రీవారి హుండీకి మళ్లీ చాలా రోజుల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఆదివారం 63,519మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే.. హుండీకి రూ.5.05 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఆదివారం 26,424మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభంకాగా.. జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. తిరుమల శ్రీవారికి దాదాపు ఒకటి రెండు నెలలుగా ఒక్కరోజు ఆదాయం రూ.5 కోట్లు దాటలేదు.. ఆదివారం మళ్లీ ఆ మార్క్‌‌కు చేరుకుంది.తిరుమలలో శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానంతిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.తిరుమల శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌రించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.టీటీడీ స్థానికాలయాల్లో చక్రస్నానంవైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో ఆదివారం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు వేడుకగా తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొన్నారు.శ్రీనివాసమంగాపురంశ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శని, ఆదివారాల్లో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఉద‌యం చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.అప్పలాయగుంటలోనిశ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం స్నపన తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు.అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, నారాయణవనం, నాగలాపురం, తొండమనాడు ఆలయాల్లో విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.తెప్పలపై శ్రీ సోమస్కందమూర్తి కటాక్షంతిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అభయమిచ్చారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ సోమస్కందమూర్తి కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు.

Leave A Reply

Your email address will not be published.