సీఎం రేవంత్ రెడ్డికి రెస్టు తీసుకోవాలని సూచించిన వైద్యులు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడ్డారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత మూడు రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో రేవంత్ బాధపడుతున్నట్లు సమాచారం. ఇంటి వద్దే ఫ్యామిలీ డాక్టర్ రేవంత్ను పరీక్షించి, మందులు సూచించారు.. కాగా రెండు రోజలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.