సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ దనసరి అనసూయ సీతక్క సోమవారం దర్శించుకున్నారు. ముందుగా పసరలోని గుండ్ల వాగు బ్రిడ్జిని, దయ్యాలవాగు సమీపంలో ఉన్న రోడ్డును చింతల్ క్రాస్ వద్ద రోడ్డు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అదే విధంగా చిలుకల గుట్ట, వీఐపీ పార్కింగ్ బస్ స్టాండ్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి జాతర పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, డీఎస్పీ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.