రైతుల సంక్షేమమే తమ ఎజండగా పని చేస్తాం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదిన సందర్భంగా రైతు సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యం లో అప్సిగూడాలోని సంఘం కార్యాలయం లో   రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ ఆద్వర్యం లో జాతీయ రైతు దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ స్పూర్తి తో  రైతుల సంక్షేమమే తమ ఎజండగా పని చేస్తామని అన్నారు.రైతు సంక్షేమానికి తెలుగు రాష్ట్రాలలో మన సంఘం మరింత ముందుకు వెళుతుందని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ  స్థాయిల్లో కమిటీలు వేసి గో ఆదారిత వ్యవసాయం కోసం రైతులతో పాటు ప్రజలను చైతన్యం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో గుర్రం నరసింహ, ఉపేందర్ రెడ్డి, జి ఆంజనేయులు గౌడ్, పృధివి పతి రావు, బి ఆంజనేయులు, ఎబినైజర్ విశ్వనాథ్, ఇరుగు రమేష్, మల్లయ్య ,మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.