స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు పర్యావరణ పరిరక్షణ సంస్థ అభినందనలు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రముఖ పర్యావరణ పరిరక్షణ సంస్థ “ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ” బృందం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సభాపతి గా బాధ్యతలు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని గడ్డం ప్రసాద్ కుమార్ ను హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపే లక్ష్యంగా కౌన్సిల్ తీసుకు వస్తున్న “ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ” మాసపత్రిక సంచికను గౌరవపూర్వకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు, పత్రిక సంపాదకులు ఎస్సీ హెచ్ రంగయ్య, సీనియర్ పాత్రికేయులు ఉప్పు వీరాంజనేయులు, సీనియర్ ఫోటో జర్నలిస్టు కేశవరావు తదితరులు పాల్గొన్నారు.