యాదగిరి గుట్టకు గీత కార్మికులు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్/ నసురుల్లాబాద్ : కల్లు గీత వృత్తి రక్షణకై రాష్ట్రంలో సమగ్రమైన చట్టం చేయాలని, వృత్తి రక్షణకై 5 వేల కొట్లు కేటాయించాలని కోరుతూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 19 20 21 న జరుగుతున్న మహాసభల కు ఈరోజు జరిగే బహిరంగ సభ యాదగిరిగుట్ట కు బయలు దేరిన కామారెడ్డి జిల్లా కల్లు గీత కార్మికులు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా అక్టోబర్ 19 న యాదగిరిగుట్ట లో జరిగే గౌడ కల్లుగీత కార్మికుల బహిరంగ సభలో జిల్లా నుండి వందలాది మంది గౌడ కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. బహిరంగ సభను జయప్రదం చేసిన గౌడ కల్లుగీత కార్మికులు కు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ తో పాటు జిల్లా నాయకులు రాజు గౌడ్ ,శంకర్ గౌడ్ ,దేవా గౌడ్ ,శివరాజ్ గౌడ్,బాల్ రాజు గౌడ్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.