టపాసు కాల్చి పరుగు పెట్టిన ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : టపాసులు, బాంబులు అంటే ఎవరికైనా భయం ఉంటుంది. కానీ వాటిని కాల్చాలనే ఆశ కూడా ఉంటుంది. అందుకే కొందరు భయపడుతూనే వాటిని కాలుస్తుంటారు. అలాంటి సందర్భాలు కొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే బీహార్‌లో ఓ ఎమ్మెల్యే టపాసు కాల్చి.. ముఖానికి గాయం చేసుకున్నారు. అయితే ఆ గాయం టపాసు కాల్చడం వల్ల కాలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ప్రారంభోత్సవానికి సోనేపూర్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలను ప్రారంభించిన ఆయన.. దానికి సంకేతంగా ఓ పటాకీ కాల్చారు. ఆ పటాకీని అగ్గిపుల్లతో ముట్టించిన వెంటనే భయంతోనో.. తన మీదే పడతాయని భావించారో.. కానీ ఒక్కసారిగా వెనక్కి పరుగు తీశారు. ఆ క్రమంలో పట్టుతప్పి పడిపోయారు. దాంతో ముఖం పగిలిపోయింది. ఆ మొహానికి గాయాలయ్యాయి. దాంతో అతనిని లేపేందుకు అందరూ ఎమ్మెల్యే దగ్గరకు పరుగులు తీశారు.అయితే ఎమ్మెల్యే వినయ్ కుమార్ సింగ్ పడి లేస్తున్న తరుణంలో ఆయన ముట్టించిన బాంబు పేలింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. అయితే ఎమ్మెల్యే వినయ్ కుమార్ స్థానిక బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతోనే అతనిని ఈ మ్యాచ్‌‌ను ప్రారంభించడానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఇది జరిగింది. కాగా కొన్ని రోజుల్లో దీపావళి పండుగ ఉండడంతో.. టపాసులు, చిన్న చిన్న బాంబులు అమ్మకాలు మొదలయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.