తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.మరోవైపు నూతన సంవత్సరం నాడు తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో తిరుమల మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వెంకటేశ్వర నామస్మరణతో మార్మోగుతున్నాయి.