నిజామాబాద్ బస్సు బిహార్‌లో బోల్తా

.. బస్సులో 38 మంది ఇక్కడి ప్రయాణికులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు బయలుదేరిన టూరిస్ట్ బస్సు బిహార్‌లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన ఓ మహిళ మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును ఆపుతున్న క్రమంలో వెనకనుంచి ఓ లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది..

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 24వ తేదీన 38 మంది యాత్రికులతో కూడిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు నిజామాబాద్‌ నుంచి బయలుదేరింది. ఈ బస్సులో నిజామాబాద్ జిల్లా వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్‌తో పాటు పాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వారు ఉన్నారు. ఈ క్రమంలోనే బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో యాత్రికుల బస్సు బోల్తా పడింది. ఓ హోటల్ వద్ద బస్సు ఆపుతుండగా వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొనడంతో బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నిజామాబాద్‌ జిల్లా వెల్మల్‌కు గ్రామానికి చెందిన సరళమ్మ(70) అనే మహిళ మృతి చెందింది. ఇటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దీంతో క్షతగాత్రులకు ఔరంగాబాద్‌ పట్టణంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.