భారత్ లో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి.తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 4,44,77,272 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.