రామ మందిరం తో సహా సీఎంను పేల్చేస్తాం

ఉత్తరప్రదేశ్‌ సిఎం  యోగి ఆదిత్యనాథ్‌ కు బాంబు బెదిరింపులు..ఇద్దరి అరెస్ట్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం తో సహా సీఎంను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు వారు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న సమయంలో ఈ బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.ఈ బెదిరింపులతో అప్రమత్తమైన యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఆధారంగా నిందితులు ఓం ప్రకాశ్‌, తాహర్‌ సింగ్‌గా గుర్తించారు. ఈ మేరకు ఆ ఇద్దర్నీ అరెస్ట్‌ చేశారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.