పీఎం కిసాన్ యోజన రైతులకు అలర్ట్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నా.. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నా.. ప్రభుత్వ పథకం పొందేందుకు అర్హులైతే తప్పకుండా ఆ పథకాలకు అప్లై చేసుకోవాలి. పథకం వర్తిస్తే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. దేశంలో ఆరోగ్యం, బీమా, గృహ నిర్మాణం, పెన్షన్ వంటి అనేక ఇతర పథకాలు అమల్లో ఉన్నాయి. అదేవిధంగా రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన రైతులందరికీ రూ. 2 వేల చొప్పున.. మూడు విడతలుగా అందజేస్తున్నారు. అంటే ఏడాదికి రూ. 6వేలు అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 15 విడుతలుగా నిధులు జమ చేశారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో 16వ విడత నిధులు జమ కానున్నాయి. ఈ నిధుల కోసం చాలా మంది రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఫండ్స్ ఎప్పుడు విడుదల అవుతాయి.. కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారు ఎలా అప్లై చేసుకోవాలి? అని సంశయంలో ఉన్నారు రైతులు. వీటన్నింటికీ ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..

 

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా ఈ పని చేయాలి..

 

పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందాలంటే ముందుగా.. భూమి ధృవీకరణ పూర్తి చేయాలి. ఒకవేళ ఈ పని పూర్తి చేయకపోతే.. కిసాన్ యోజన ప్రయోజనం పొందలేకపోవచ్చు. అంటే ఇందుకోసం రైతులు e-KYC ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ e-KYC ని పూర్తి చేసిన రైతులకు మాత్రమే కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు పడే అవకాశం ఉంది. ఒకవేళ మీరు e-KYC ని పూర్తి చేయకపోతే వెంటనే చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. అధికారిక పోర్టల్ pmkisan.gov.in ని సందర్శించడం ద్వారా గానీ.. బ్యాంకుకు వెళ్లడం ద్వారా గానీ, సమీపంలోని CSC కేంద్రం వద్దకు వెళ్లి గానీ ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

 

16వ విడత నిధులు ఎప్పుడు?

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 15 దఫాలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈ పథకం ద్వారా 8 కోట్ల మందికి పైగా అర్హులైన రైతులు ప్రయోజనం పొందారు. అదే సమయంలో 16వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, 16వ విడతకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరలో గానీ, మార్చి నెల మొదట్లో గానీ రైతుల ఖాతాల్లో కిసాన్ యోజన నిధులు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

నవంబర్ నెలలో రూ. 2000 చోప్పున 15వ విడత నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరితో నాలుగు నెలలు పూర్తి కానుండగా.. మార్చి నెల మొదటి వారంలో 16 విడత నిధులు రైతుల ఖాతాల్లో పడే ఛాన్స్ ఉంది. అయితే, ఈ విడత నిధులు పడాలంటే రైతులు ఈ-కేవైసీ ని పూర్తి చేయాల్సిందే. ఒకవేళ ఎవరైనా రైతులు తమ కేవైసీని పూర్తి చేసుకోకపోతే.. వెంటనే సంబంధిత కేంద్రం వద్దకు వెళ్లి కేవైసీని పూర్తి చేసుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.