తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని బాన్సువాడ రూరల్ సీఐ మురళి అన్నారు. బుధవారం బాన్సువాడ పరిధిలోని బీర్కూర్ కు వెళ్లే రహదారిలో ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై ధాన్యం నూర్పిడి చేస్తున్న రైతులతో సిఐ మాట్లాడారు. రైతులు ఆరు బయట మైదాన ప్రాంతాల్లో కోతలు కోసిన అనంతరం తమ పంట పొలాల్లో కార్బన్ కవర్లు వేసుకొని ధాన్యం నూర్పిడి చేసుకోవాలని ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం మంచిది కాదన్నారు. దీనివలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.