అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతుంది..

.. కాంగ్రెస్ సీనియర్ నేత బండ్ల గణేష్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత బండ్ల గణేష్ అన్నారు. గాంధీభవన్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిన్నటితో ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకుంది. అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతుంది.

ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి , మంత్రులు ప్రజాపధం వైపుకు దూసుకుపోతున్నారు.మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కు ఈర్ష పిక్ స్టేజ్ కి చేరుకుంది. వందరోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుంది అన్నారు. హరీష్ రావ్ఈ పది సంవత్సరాలు ఏం చేశారు హరీష్ రావు తెలంగాణకి రావలసిన హామీలపై ఏమైనా కేంద్రంతో కొట్లాడారా. అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ,మంత్రులు ప్రధానమంత్రి , కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తెలంగాణకి రావలసిన నిధులు పోరాటం చేస్తున్నారు.
అవినీతి అధికారులను పక్కకు తప్పుంచి నిజాయితీ అధికారులను నియమించుకొని పరిపాలన చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మీరు ఒక్క స్థానం కూడా గెలవరు.
రాష్ట్రపతి వస్తే స్వాగతం పలకడానికి కూడా మీ ముఖ్యమంత్రి వెళ్లలేదు హరీష్ రావ్
మాజీ రాష్ట్రపతి వస్తే మా ముఖ్యమంత్రి వెళ్లారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంది..

 

ఏ సమస్య ఉన్న ప్రజలు సచివాలయం కి వెళ్తున్నారు..

 

హరీష్ రావు , కేటీఆర్ ఎందుకు ఇంతగా ఆగం అవుతున్నారు ..

 

ప్రగతి భవన్ని మా దళిత ఉప ముఖ్యమంత్రికి ఇచ్చారు అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.