రాముని ప్రాణ ప్రతిష్ట రోజే బిడ్డ పుట్టాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు  పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు  జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడే ప్రసవించేలా చేయాలని కోరుతున్నారు. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్య మాదిరిగా తాము కూడా చరితార్థులం కావాలని గర్భిణులు కోరుకుంటున్నారు. దవాఖానల్లోని వైద్యులు కూడా వీరి కోరికను తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గర్భిణి ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే ఆ రోజు ప్రసవం జరిగేలా చేస్తామని షరతు విధిస్తున్నామని వైద్యులు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.