మల్లికార్జున్ ఖర్గే విజయం పై రేవంత్ రెడ్డి హర్షం

తెలంగాణ జ్యోతి/:వెబ్ న్యూస్ : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత ప్రజాస్వామికంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించారని, ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. ఖర్గే విజయం సాధించడం పట్ల మాజీ ఎంపీ మల్లు రవి సైతం హర్షం వ్యక్తం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.