డీఎంకేకు చెందిన సగం మంది మంత్రులు జైలుకే వెళ్తారు..

 - బీజేపీ నేత హెచ్‌.రాజా సంచలన కామెంట్స్..

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరిగే లోపు డీఎంకేకు చెందిన సగం మంది మంత్రులు జైళ్లలో ఉంటారని బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా చెప్పారు. శివగంగలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో ఏర్పాటు కానున్న కూటమి పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందన్నారు. ‘ఇండియా’ కూటమి పార్టీల్లో ఐక్యత లేదన్నారు. కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ కలిసి పోటీచేసే అవకాశం లేదని, దానిని బట్టి ఆ కూటమి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అయోధ్య రామాలయం కుంభాభిషేకం జరిగే సమయంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో విశేష పూజలు, కుంభాభిషేక ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ చర్యలు చేపట్టాలని హెచ్‌.రాజా డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.