మహాలక్ష్మి స్కీం వల్ల ఈసారి ఏపీకి తగ్గిన బస్సుల సంఖ్య
సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం అమలు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సంక్రాంతి పండుగ కోసం 4484 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం మీడియా తో ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎంజీబీఎస్ నుంచి మాత్రమే కాకుండా ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. మహాలక్ష్మి స్కీం వల్ల ఈసారి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.