అస్వస్థతకు గురైన మాజీ రాష్ట్రపతి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె బుధవారం రాత్రి నుంచి పుణెలోని భారతీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.