వైఎస్ వివేకా కు నివాళులర్పించిన సునీత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి ఇవాళ‌. ఈ సందర్భంగా పులివెందులలోని ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు. అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి పూలమాలలు వేశారు.

మరోవైపు కడపలోని జయరాజ్‌ గార్డెన్‌లో నేడు వివేకా వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ, వైఎస్‌ సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.