జయ జయహే తెలంగాణ గీతానికి మ్యూజిక్ అందించనున్న కీరవాణి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జయ జయహే తెలంగాణ” అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గీతం త్వరలో ప్రజల ముందుకు రానుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ గేయానికి సంగీతం అందించనున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో రచయిత, నేపథ్య గాయకుడు అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి భేటీ అయ్యారు. ప్రతీ ఒక్కరూ పాడుకునేలా సంగీతం, స్వరకల్పన చేయాలని కీరవాణిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గేయ రచయిత అందెశ్రీ, కీరవాణిని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.