ఆస్ట్రేలియాలో మొదటి మానవ బర్డ్ ఫ్లు కేసు నమోదు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆస్ట్రేలియాలో మొదటి మానవ ‘బర్డ్ ఫ్లూ’ కేసు నమోదు అయింది. మీడియా నివేదిక ప్రకారం, కొన్ని వారాల క్రితం భారతదేశంలో ఉన్నప్పుడు ఒక చిన్నారిలో హ్యూమన్ బర్డ్ ఫ్లూ సోకిందని భావిస్తున్న మొదటి కేసును ఆస్ట్రేలియా ప్రకటించింది. “విక్టోరియాలోని ఒక బిడ్డకు బర్డ్ ఫ్లూ మొదటి కేసు ఉన్నట్లు నిర్ధారించబడింది. భారతదేశంలో ఉన్నప్పుడు పిల్లవాడికి ఏవియన్ ఇన్ఫ్లుఎంజా A (H5N1)కి గురైయ్యాడు. దీని వలన ఈ ఏడాది మార్చిలో అస్వస్థతకు గురయ్యాడు ”అని రాష్ట్ర ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ మీడియా సంస్థ (9news.com.au) తెలిపింది.

దీనిపై విక్టోరియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ‘ఎక్స్’ ద్వారా స్పందించింది. “బర్డ్ ఫ్లూ” అని పిలువబడే ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా A(H5N1) ఇన్‌ఫెక్షన్ యొక్క మానవ కేసు విక్టోరియాలో నమోదు అయింది. అయితే విక్టోరియాలో వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వ్యక్తుల మధ్య వ్యాపించలేనందున, ఇతరులకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది” అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొన్న చిన్నారి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని వారు పేర్కొన్నారు. విక్టోరియాలోని ఒక పొలంలో బర్డ్ ఫ్లూ కనుగొనబడిన కొన్ని గంటల తర్వాత ఈ కేసు ప్రకటించబడిందని స్థానిక మీడియా సంస్థ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.