చెల్లిపై అన్న అత్యాచారం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో వెలుగులోకి వచ్చింది.చిత్రదుర్గకు చెందిన బాధిత యువతి (18) స్థానికంగా ఓ కాలేజీలో చదువుతోంది. అయితే, ఆమెకు వేరే భాష నేర్చుకోవాలని, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలనే కుతూహలం ఉండేది. ఆమె కోరికను కుటుంబ సభ్యుల ప్రోత్సాహించడంతో ఓ మసీదులో మూడేళ్ల ఇస్లామిక్ స్టడీస్ కోర్సులో చేరింది. అదే ఆమెను ప్రమాదంలోకి నెడుతుందని గ్రహించలేకపోయింది. బాధితురాలిపై కన్నేసిన కామాంధుడైన అక్కడ మౌల్వీ అబ్దుల్ రెహ్మన్.. లొంగదీసుకోవాలనే ఆలోచనతో ఓ పన్నాగం పన్నాడు. ఆమెకు దెయ్యబం పట్టినట్టు ఉందని, శాంతిపూజలు చేయాలని ఆమె తల్లిని నమ్మించాడు.ఇంట్లోనే ఏర్పాట్లు చేసిన నిందితుడు.. ఏకాంతంగా పూజలు చేయించాలని నమ్మించి అందరినీ బయటకు పంపాడు. తన ప్లాన్ ఫలించిందని భావించిన కామాంధుడు.. కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో మరో ఎత్తుగడ వేసిన అతడు.. పూజ చేసేవేళ మరొకరి సాయం కావాలంటూ ఆమె సోదరుడ్ని (23)ని గదిలోకి తీసుకెళ్లాడు. ఏవో పూజలు చేసి.. సోదరితో శారీరకంగా కలిస్తే దయ్యం వదిలిపోతుందని నమ్మబలికాడు. తొలుత అతడు అందుకు అంగీకరించకపోయినా లేనిపోని అపోహలతో భయపెట్టి ఒప్పుకునేలా చేశాడు.మతపెద్ద కుట్రను గ్రహించలేకపోయిన అతడు.. సొంత చెల్లిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనను దుండగుడు మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి ఆపై కుటిల ఎత్తుగడ మొదలుపెట్టాడు. వీడియోను చూపించి బయటపెడతానని బెదిరించి, బాధితురాలిని లొంగదీసుకున్నాడు. గత ఆరు నెలలుగా తరుచూ బాధితురాలికి నరకం చూపించాడు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తల్లికి అనుమానం మొదలైంది. చివరికి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో లైంగిక దాడికి గురైన బాధితురాలు.. గర్బం దాల్చినట్టు తేలింది. నిర్ఘాంతపోయిన తల్లి నిలదీయడంతో ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. మౌల్వీ అరాచకాన్ని బయటపెట్టింది.దీనిపై చిత్రదుర్గం మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. యూపీకి చెందిన మౌల్వీ అబ్దుల్ రెహ్మాన్, అతడి మాటలు విని చెల్లినే చెరిచిన అన్నను అరెస్ట్ చేశారు. బాలికను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు

Leave A Reply

Your email address will not be published.