ఈనెల 12న కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 12న కొలువుదీరనుంది. జూన్‌ 9 న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందుగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నప్పటికీ, అదే రోజున ప్రధాని మోడీ ప్రమాణస్వీకారో త్సవం ఉండటంతో బాబు ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. అలాగే 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా ప్రధాని మోడీ హాజరు కానున్నారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు అదే అమరావతికి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అమరావతి తోడ్పాటుపై ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వని ప్రధాని మోడీ దాదాపు పదేళ్ల తరువాత అమరావతి వేదికగా రాష్ట్రానికి స్పష్టమైన హామీలు ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో ప్రధానిగా మోడీ చాలా చాలా బలంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ మనుగడ అప్పట్లో కూటమిలోని భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడి లేదు.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. చంద్రబాబు, తెలుగుదేశం మద్దతే ఇప్పుడు మోడీ సర్కార్ మనుగడకు అత్యంత కీలకం.

Leave A Reply

Your email address will not be published.