రామోజీరావు అంతిమయాత్రలో పాడే మోసిన చంద్రబాబు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీ నుంచి ప్రారంభమై.. రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా స్మృతి వనం వద్దకు చేరుకుంది. రామోజీరావు అంత్యక్రియలకు అధినేత (Chandrababu) హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన రామోజీరావు పాడె మోశారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఈనాడు సంస్థల సిబ్బంది, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మీడియా మొఘల్‌కు కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. అటు, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు మరణానికి సంతాపంగా ఏపీలో ఆది, సోమవారాలు సంతాపదినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అటు, తెలంగాణలో షూటింగ్స్ ఆదివారం బంద్ కానున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.