బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈటెల?
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో అనేక రాష్ట్రాల్లో ఎంపీలకు మంత్రి పదవులు వరించాయి. తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయని ప్రచారం సాగుతోంది.
ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender)కు ఆశాభంగం తప్పలేదు. ఆయన్ని బుజ్జగించేందుకుగానూ కాషాయపార్టీ బీజేపీ(BJP) రాష్ట్రాధ్యక్ష పదవిని ఈటలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టారు. ఇప్పుడు వారిద్దరిని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చూస్తున్న మోదీ – షా ద్వయం రాష్ట్రంలో పార్టీ పగ్గాలను ఈటలకు అప్పగించాలని భావిస్తోందట