మణిపూర్ సీఎం కాన్వాయ్ పై మిలిటెంట్ల దాడి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మణిపుర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్ పై ఇవాళ (సోమవారం) మెరుపు దాడి చేశారు. భద్రతా కాన్వాయ్ వాహనాలపై పలుమార్లు తుఫాకీతో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఓ భద్రతా సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయినట్లు పేర్కొన్నారు. సీఎం ముందస్తు కాన్వాయ్ సమస్యాత్మక ప్రాంతమైన జిరిబామ్ జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాంగ్పోక్పి జిల్లాలో జరిగినట్లు చెప్పుకొచ్చారు.

కాగా, జిరిబామ్ ప్రాంతంలో రెండు పోలీస్ ఔట్ పోస్టులు, ఒక ఫారెస్ట్ బీట్ అధికారి ఆఫీసుతో పాటు దాదాపు 70 ఇళ్లను గత శనివారం గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) ఢిల్లీ నుంచి ఇంఫాల్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, జిరిబామ్ ను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రణాళిక రెడీ చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.