హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:హైదరాబాద్ బహదూర్‎పురలో డ్రగ్స్ ముఠాని నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4లక్షల విలువైన 34 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన సయ్యద్‎ ఫైసల్‎పై గతంలో డ్రగ్స్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఇటివలే జైలు నుంచి వచ్చిన సయ్యద్ ఫైసల్…భార్య, ఫ్రెండ్స్‎తో సయ్యద్ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా సయ్యద్ దంపతులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

Leave A Reply

Your email address will not be published.