బిగ్ బాస్ 8 కు రంగం సిద్ధం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. షో భారీ టీఆర్పీ రాబట్టింది. గత సీజన్ లో అనేక సంచలనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఒక సామాన్యుడు టైటిల్ విన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు.  టైటిల్ విన్నర్ శివాజీ అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. మైండ్ గేమ్ ఆడుతూ శివాజీ టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ కి అతడు గైడ్ గా వ్యవహరించాడు. అతడిని ప్రోత్సహించాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడంలో శివాజీ పాత్ర చాలా ఉంది.    చివరి వారాల్లో పల్లవి ప్రశాంత్ బాగా పుంజుకున్నాడు. అదే సమయంలో శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అమర్ దీప్ కెప్టెన్ కాకుండా అడ్డుకోవడం, శోభా శెట్టి మీద చేసి హేట్ కామెంట్స్ అతని ఇమేజ్ ని దెబ్బ తీశాయి. శివాజీ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  కాగా లేటెస్ట్ సీజన్ కి అతనికి బంపర్ ఆఫర్ దక్కింది అంటూ ప్రచారం జరుగుతుంది. సీజన్ 8 అనుకున్న సమయాని కంటే ముందు మొదలు కానుంది. ఆగస్టు లో షో స్టార్ట్ అవుతుందని విశ్వసనీయ సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బమ్ చిక్ బబ్లు, సురేఖావాణి, రాజ్ తరుణ్, బర్రెలక్క, హేమ, కిరాక్ ఆర్పీ వంటి కొన్ని క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి.  బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీ ఎంపికయ్యాడు అనేది తాజా సమాచారం. బిగ్ బాస్ బజ్ గురించి తెలిసిందే. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు. హౌస్లో వారి ప్రవర్తన , తప్పు ఒప్పుల గురిన్సిహ్ నిలదీసే షో ఇది.    గత సీజన్లో గీతూ రాయల్ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేసింది. సీజన్ 8కి శివాజీ ఉంటాడని సమాచారం. మరి అదే జరిగితే కంటెస్టెంట్స్ ని తన సూటి ప్రశ్నలతో శివాజీ ఉక్కిరిబిక్కరి చేయడం ఖాయం. మరి చూడాలి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో. శివాజీ నటుడిగా మరలా బిజీ అయ్యాడు. ఆయన కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లు సమాచారం

Leave A Reply

Your email address will not be published.