200 మంది చిన్నారులకు పౌష్టికాహార లోపంతో ముప్పు

 తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉత్తర గాజాలో పౌష్టికాహారలోపంతో ఓ బాలుడు మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. పౌష్టికాహార లోపం కారణంగా 200కు పైగా గాజా చిన్నారులు మరణించే ప్రమాదం ఉందని ఉత్తర గాజాలోని కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే .. గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను తీవ్రతరం చేసింది. 250 రోజులు దాటినా..రఫాపై బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. ఉత్తర గాజాలోని స్థానిక భవనంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులతో 14 మంది మరణించారు.గాజాపై జరిగిన దాడిలో ఇప్పటివరకు 37,232 మంది పాలస్తీనియన్లు మరణించగా, 85,037 మంది గాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.