హైదరాబాద్ లో వాహనదారులకు అలర్ట్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రేపు జూన్ 17న నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముస్లింల ముఖ్య పండుగల్లో ఒకటైన బక్రీద్‌ సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రార్థనల కోసం ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చే మాసబ్‌ ట్యాంక్‌ సమీపంలోని మీరాలం దర్గా, హాకీ గ్రౌండ్‌, లంగర్‌హౌజ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
రేపు ఉదయం 8:00 నుంచి 11:30గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. మాసబ్‌ట్యాంక్‌, మీరాలం దర్గా వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్‌ మళ్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే ఈ రూట్లలో అనుమతిస్తామని.. మిగతా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఇక ప్రార్థనల కోసం వచ్చే వారి కోసం ఈద్గాల సమీపంలో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు.

Leave A Reply

Your email address will not be published.