కిరణ్ కుమార్ రెడ్డి రూటే సపరేటు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రాహుల్ యాత్ర ఏపీలో రెండవ రోజు సాగుతోంది. మరో మూడు రోజుల పాటు సాగనుంది. అయితే కాంగ్రెస్ పెద్దలు దిగ్విజయ్ సింగ్ కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం పల్లంరాజు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క రాహుల్ తో పాటు నడుస్తున్నారు. కానీ కాంగ్రెస్ వల్ల అతి పెద్ద ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కనిపించకపోవడం పై పార్టీలో చర్చ సాగుతోంది.అయితే కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి చేరినా ఆయన యాక్టివ్ గా లేరనే అంటున్నారు. ఆ మీదట సమైక్యాంధ్రా అంటూ పార్టీ పెట్టి తన తమ్ముడిని పోటీకి దించినా ఆయన గెలవలేదు. అలా కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ మధ్యన ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్లే లెక్క. అలాంటి ఆయన తన సొంత రాష్ట్రం ఏపీలో రాయలసీమలో కర్నూల్ జిల్లాలో రాహుల్ గాంధీ చెమటోడ్చి ప్రతిష్టాత్మకమైన భారత్ జోడో యాత్ర సాగిస్తూంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా కనిపించకపోవడం మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది.అందుకే ఆయన సైలెంట్ గా ఉంటూ అన్ని పరిణామాలను గమనిస్తున్నారు అని అంటున్నారు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకోదు అని ఆలోచనలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. అందువల్లనే ఆయన రాహుల్ పాదయాత్రలో ఎక్కడా కనిపించడంలేదు అని అంటున్నారు. అదే నిజమైతే రాహుల్ కి ఆయాసం తప్ప ఏపీలో కాంగ్రెస్ కి కొత్త కాంతి కిరణాలు కనిపిస్తాయా అన్న చర్చ అయితే ఉంది.

Leave A Reply

Your email address will not be published.