ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  ఢిల్లీలోని జామా మసీదు వద్దకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలివచ్చారు. ఈద్‌గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీలంపూర్‌ ఉమర్‌ మసీదు, ఫతేపురి మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. ఇక హైదరాబాద్‌లో కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు మక్కా మసీదుకు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. బక్రీద్‌ సందర్భంగా ముస్లింలకు ప్రధాని నరేంద్రమోడి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ లు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోడి – మాజీ రాష్ట్రపతి శుభాకాంక్షలు …బక్రీద్‌ పండుగ మానవాళి మంచి కోసం కృషి చేయడానికి మనలో స్పూర్తిని మరింతగా పెంచుతుందని ప్రధాని మోడి ట్వీట్‌ చేశారు. బక్రీద్‌ పండుగ త్యాగం, సేవకు చిహ్నంగా నిలుస్తుందని, సేవకు మనల్ని మనం అంకితం చేసుకుని దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.
ఖుర్బీనా పండుగ…త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేమైంది. ఈ పండుగను ‘ఖుర్బీనా పండుగ’ లేదా ‘ఈద్‌ అల్‌ అధా’ అని కూడా పిలుస్తారు. రంజాన్‌ తర్వాత వచ్చే ఇస్లామిక్‌ క్యాలెండర్‌ లో ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ జరుపుకుంటున్నారు. యెమెన్‌, కెన్యా, ఈజిప్ట్‌, లిబియా, ఆప్ఘానిస్తాన్‌ దేశాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.