24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈనెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరగనుంది. అయితే అసెంబ్లీ స్పీకర్‌గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది.

అయితే డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌విప్‌ ఎవరికి ఇస్తారన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎన్నికైన వారిలో సీనియారిటీపరంగా అయ్యన్నపాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్‌గా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్‌ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈనెల 22వ తేదీన సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.