ట్యాంకర్ బోల్తా .. ఆయిల్ కొరకు ఎగబడ్డ జనం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పల్నాడు జిల్లా పెద్దనెమలిపురి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో జనాలు ఆయిల్ కోసం ఎగబడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద్దనెమలి గ్రామం వద్ద అయిల్ ట్యాంకర్ బోల్తా పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
ప్రజలు అయిల్ కోసం ఎగబడి దొరికిన కాడికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు ఆయిల్ ట్యాంకును పక్కకు తప్పిస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.