పవన్ కళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపులకు దిగిన హైపర్ ఆది
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్కి పెద్ద అభిమాని. జనసేన పార్టీలో చేరి ఆయన ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. కానీ సర్దుబాటులో ఆయనకు రాలేదు. కానీ పవన్కి అభిమానిగానే, ఆయనకు సపోర్ట్ గానే నిలుస్తున్నారు హైపర్ ఆది. అంతేకాదు పవన్ స్పీచ్లకు కూడా ఆది సపోర్ట్ గా ఉంటాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. చంద్రబాబు సీఎం అయ్యారు. పవన్ కల్యాణ్ పార్టీ 21 సీట్లకు 21 గెలుచుకుంది. పిఠాపురం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. పదేళ్ల పోరాటం తర్వాత పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు, ఫాలోవర్స్ అంతా ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. దాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ మొత్తం ఎన్నికల్లో పవన్ విజయం సాధించడం హైలైట్ పాయింట్గా నిలిచింది. పైగా ఆయన చుట్టూనే రాజకీయం తిరగడంతో పవన్ ప్రతి స్టెప్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇప్పుడు దాన్ని హైపర్ ఆది కూడా వాడుకుంటున్నారు. తాను ఎవరి తాలూకనో తెలుసు కదా, అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు ఆది. తాజాగా ఢీ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో డాన్స్ మాస్టర్ పండు అంట్ టీమ్ ఆదితో కలిసి ఓ స్కిట్ ప్రదర్శించారు. పండు టీమ్ అంతా కింద కూర్చున్నారు. అప్పుడే వచ్చిన హైపర్ ఆది, ఏంట్రా బంతిభోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు అని అనగా, ఏంటన్నా, ఛాలెంజ్ మర్చిపోయావా? వాళ్లు ఇప్పుడు వచ్చి కూర్చోవాలి, లాస్ట్ రౌండ్ మనమే గెలిచాం అంటాడు పండు. దీంతో `ఆడవాళ్లు గుళ్లో కూర్చోవాలి కానీ ఒళ్లో కూర్చోవడం ఏంట్రా సిగ్గులేదా మీకు అంటూ ఫైర్ అయ్యాడు. దెబ్బకి బెదిరిపోయారు. మరో మాస్టర్ని పట్టుకుని నువ్వు ఎలా కూర్చున్నావో తెలుసా? ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయాక.. ఆరెంజ్ జ్యూస్, ఐదు వందల రూపాయల కోసం కూర్చున్నట్టు కూర్చున్నావ్ అనడంతో ఆయనకు మతిపోయింది. ఇంతలోనే అందుకున్నాడు పండు మాస్టర్ నువ్వు ఎంత చెప్పినా ఈ రోజు తగ్గేదెలే అన్నాడు. అడ్డొస్తే తొక్కి పడేస్తా అంటూ హైపర్ ఆదిని బెదిరించాడు పండు మాస్టర్. దీంతో ఆది విజృంభించాడు. `రేయ్ మనం ఎవరి తాలూకో తెలుసా? నీకు పిఠాపురం గుర్తుందా అంటూ వార్నింగ్ ఇస్తూ వెళ్లిపోయాడు హైపర్ ఆది. దీంతో ఇది హైలైట్గా నిలిచింది. మొత్తానికి షోలోనూ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి, పిఠాపురం పేరు చెప్పి బెదిరింపులకు దిగడం గమనార్హం.